Wednesday 13 January 2016










.....
ఆత్మీయ మిత్రులందరికీ, భోగి, సంక్రాంతి పర్వదిన శుభాకాంక్షలు.
  శ్రీవైష్ణవులనే  కాదు. చరాచర జగత్తు సర్వాన్న్నీ  ప్రేమపాత్రుడైన మురళీకృష్ణుని  మధుర భక్తిలో తలమునకలుగ నిండమనీ, అదే జన్మ జన్మలకూ తన జీవితాశయమని ఆండాళ్ తన పాశురాలలో విశద పరచిన పవిత్ర మార్గశీర్షమాసమిది. ఆ తల్లి,  జీవులందరూ  స్త్రీలే-ఒక్క పరమాత్మ తప్ప,  అంటూ  మనందరికీ  సూచించిన యీ పరమ సత్యాన్ని,  స్త్రీప్రాయమితరం జగత్ అన్న వేదోక్తి యేనాడో ధృవీకరించింది. అసలు గోపికలందరూ రామైక్యాన్ని ఆశించిన మునులేనంటున్నాయి పురాణాలు కూడా! వాళ్ళందరూ గోపికారూపాలలో,  మధుర భక్తిని తమ సొంతం చేసుకున్నారట ద్వాపర  యుగంలో! స్త్రీ పురుషులన్న  తేడాలేమాత్రమూ   లేక, అందరమూ, శ్రీకృష్ణుని లీలామానుష రూపాకర్షణకు  లొంగని వాళ్ళెవరూ ఇప్పుడూ ఉండరు కదా! 1970లో అయ్య, నల్లకుంట రామాలయంలో, ముఫై రోజులపాటు  తిరుప్పావై వుపన్యసాలిచ్చినప్పుడు, అయ్యతొ నేనూ వున్నాను. శ్రీమాన్ వీ.పీ.రాఘవాచార్యులుగారూ (ఒకప్పుడు వుపాధ్యాయుల హక్కులకోసం చాలా అంకిత భవంతో  తీవ్రంగా కృషి వేసిన యెం. యెల్. సీ కూడా వారు - వురుపుటూరు రాఘవాచారి  అనేవారయ్య   వారిని) శ్రీమాన్ వీ .రాఘవన్ గారూ  (1980లో ఆంధ్ర ప్రదేష్  రాష్ట్ర అత్యున్నత సివిల్ ఇంగినీర్ గా పనిచేసిన, ఇప్పుడు కూడా అనేకానేక  సామాజిక సాంఘిక సేవా కార్యక్రమలలో చురుకుగా పనిచేస్తున్న వారు,  డీ డీ కాలనీలో  అహోబిల మఠ్ ఆలయాన్ని కట్టించినవారు, రాఘవాచారిగారికి మరిదిగారు) వీరిరువురి అధ్వర్యంలో జరిగాయా ప్రసంగ మాలికలు! అప్పుడు అయ్య యెంతో వుద్వేగంతో  ప్రతిరోజూ రెండు గంటలపాటు భక్తి సంప్రదాయం, మధుర భక్తీ, ద్రవిడ ప్రబంధ  విశేషాలూ అన్నిటితో, వుపన్యసించటం విన్నాన్నేను.  పూర్తిగా కాకపోయినా, అ శృత  పాండిత్యం కస్త ఇంకా నాలో మిగిలే వుంది.(వాటికి సంబంధించి అయ్య స్వదస్తూరీతో తయారు చేసుకున్న  నోట్స్ కూడ నావద్ద కొంత వున్నది)  అందుకే ఆ అనుబంధానికి, అయ్య మాకందించిన హిందీ లో అక్షర రూపమివ్వగా, టీ టీ డీ హిందీ సప్తగిరిలో 2008లో ధారావాహికగా రావటం, అటు తరువాత, డా.శ్రీమాన్ కే.వీ.రమణాచారిగారు, టీ టీ డీ కి సీ ఈ ఓ గా   వున్నప్పుడు, దాన్ని టీ టీ డీ ప్రచురణగా  అంగీకరించటమూ జరిగింది. (బాపూ గారి వర్ణచిత్రాలు కూడా ఇందులో పొందుపరచటం-అయ్య ఆశీస్సులవల్లే జరిగిందనుకుంటాను) ఆ నాటి జ్ఞాపకాలతో ఆ  ప్రచురణలోని కొన్ని పుటలు ఇవిగో మీకోసం! 
  13-1-2016

No comments:

Post a Comment