మందాక్రాంత వృత్తంలో సాగే వేదాంత దేశికులవారి హంస సందేశ కావ్యం లోని వస్తువు- రాజ హంసతో శ్రీరాములవారు- అశోకవనంలోనున్న తన ధర్మపత్ని సీతాదేవికి సందేశాన్ని పంపటం. అసలు మందాక్రాంత వృత్తం అంటే? మందం ఆక్రమితి- మెల్లగా కొండచిలువవలె నెమ్మదిగా సాగే వృత్తం అని పెద్దలు చెబుతారు. క్షేమేంద్రుని ప్రకారం, విరహ బాధను వర్ణించేందుకు బహు బాగుగా పనికి వచ్చే వృత్తమిది. పరకాల నాయకీ(పెరియ తిరుమొళి) పరాంకుశ నాయకీ (తిరువాయ్ మొళీ) వీరిరువురూ, కొంగలనూ, చిలుకలనూ తమ సందేశవాహకులుగా వినియోగించుకున్నారు. కాళిదాసు మేఘ సందేశం యెలాగూ వుండనే వుంది.
Wednesday 30 December 2015
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment