Sunday 1 November 2015





కరీణ్ణగరం లోని యజ్ఞ వరాహస్వామి పవిత్ర సన్నిధిలో యీ పురస్కారం అందుకోవటం- యెంతో గొప్ప అదృష్టంగా భావిస్తున్నాను. శ్రీమాన్ విజయసారధి గురువర్యుల ఆశీస్సులుకూడా దక్కటం మరో గొప్ప అనుభూతి. సహజ సుందరమైన పరిసరాలు, మనసులూ, భక్తి భావ తత్పరతతో జరుగుతున్న పూజదికాలూ.. యజ్ఞాలూ నన్ను మరొలోకంలొకి తీసుకెళ్ళాయి. ఘనాపాటులైన వేదపండితులూ, గురుతుల్యులూ, మా అయ్యగారికి అత్యంత ఆప్తులూ, నాకు మార్గనిర్దేశకులూఐన శ్రీరంగాచార్య స్వామివారూ, సోదరుడూ, సువిఖ్యాత విమర్శకులూ డా. లక్ష్మణచక్రవర్తి గారితోపాటూ ఒక పురస్కారాన్ని అందుకోవటం యెంతో ఆనందదాయకం. సువిఖ్యాత కవి, విమర్శకులూ శ్రీమాన్ గిరిజామనోహర్ బాబుగారు యీ పురస్కరానికి నన్ను అర్హురాలిగా యెంపికచేయటం-కేవలం పుట్టపర్తివారి తనయను కావటమేనని నా విశ్వాసం. కారులో నిన్నటి ప్రయాణంలో, శ్రీరంగాచార్యులవారి చతురోక్తులూ, సాహిత్య రసగుళికల ఆస్వాదనోల్లాసం- లక్ష్మణచక్రవర్తిగారికీ నాకూ కూడా మర్గాయాసమన్నమాటే గుర్తుకు రాకుండా చేశాయి. ధన్యోస్మి! (యీ లింక్ పంపిన మేడిశెట్టి గోపాల్ గారికి కృతజ్ఞతలు)...2-11-15
...................

No comments:

Post a Comment